#s2news #raghunandanrao #bjp
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగోతంపల్లి గ్రామంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే పర్యటించారు.గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిన బాధితులను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. ఇల్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇల్లు కూలిపోయిన బాధితులకు హామీ ఇచ్చారు. పురాతన ఇండ్లలో ఎవరు ఉండవద్దని సూచించారు. వర్షాలతో పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న బాధితులను ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూంలో మౌలిక సదుపాయాల తో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట దుబ్బాక ఎమ్మార్వో ఎండి సలీం మియా ,గ్రామ సర్పంచ్ రెడ్డి దేవి రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బిజెపి నాయకులు పలువురు ఉన్నారు.
...
https://www.youtube.com/watch?v=O8eDocB0d9M
#trsdharna #dharnachittapoor #dumpalapally
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. యాసంగి లో కేంద్ర ప్రభుత్వం వారి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గంట పాటు చేసిన రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
...
https://www.youtube.com/watch?v=55v3n_AeR9M