కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ఎలాంటి అపోహలు లేకుండా 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా మండల స్థాయి అధికారులు కృషి చేయాలని డి ఆర్ డి ఎ పిడి గోపాల్ రావు అన్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అపోహలను తొలగించాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఐకెపి సిబ్బంది, ఆశ వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషిచేసి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. మొదటి వ్యాక్సిన్ తీసుకున్నవారికి సెకండ్ డోస్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. వాక్సినేషన్ లో ఇబ్బందులు తలెత్తే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని తెలిపారు. అలాంటి పరిస్థితులు మళ్లీ మనదేశంలో రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు 100% వ్యాక్సినేషన్ తీసుకోవాలనే ఉద్దే�
...
https://www.youtube.com/watch?v=X8xs-CR3SPg
#raghunandanrao
ఆర్టీసీ కార్మికులతో తల గోక్కున్నోడు బ్రతికి బట్టకట్టినట్టు చరిత్రలో లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పేర్కొన్నారు. బతుకమ్మ దసరా పండుగ జరుపుకోకుండా ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేసి వారి జీవితాలతో ఆటడుకుంటున్న కెసిఆర్ కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు సమ్మె మూడో రోజు కొనసాగిస్తున్న సందర్భంగా వారికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మద్దతు తెలిపారు.సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వారి బాధలను వెల్లడించారు. ఈసందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ పేద కార్మికుల పొట్టగొట్టినోడు ఎవరు కూడా బ్రతికి బట్టకట్టినట్టు చరిత్రలో లేదన్నారు. యాబై వేల కార్మికుల ఉసురు తిరగడం ఖాయమని అన్నారు. మీరు చెప్పినట్లు ఆర్టీసీ కార్మికులకు యాబై వేల జీతం ఎక్కడస్తుందో చూపెట్టుమన్నారు. ఆర్టీసీ కార్మికులను మోసం చేసి వారి ప్లేస్ లో కొత్త కార్మికులను చేర్పించుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా మీబుద్ది మార్చుకొని ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
...
https://www.youtube.com/watch?v=wsW84Ki9J2k
#s2news #sports #dubbak
యువత చదువుతో పాటు క్రీడల్లో రానించాలని సర్పంచ్ నాగభూషణం, ఎంపీటీసీ లక్ష్మి నారాగౌడ్ అన్నారు. జిల్లా స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలో దుబ్బాక మండలం ఆకారం గ్రామం నుండి పాల్గొనాలని క్రీడాకారులను సూచించారు. క్రీడాకారుల ప్రోత్సాహం లో భాగంగా వారికి వాలీబాల్ కిట్టు, టెన్నిస్, డ్రెస్ కోడ్ లను అందించారు. యువత క్రీడల్లో ముందుండి ఆకారం గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఆకారం గ్రామానికి చెందిన మెట్ల కిరణ్ ఇటీవల వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన సందర్భంగా వారికి శాలువాతో సన్మానించి, మరింత కష్టపడి నేషనల్ స్థాయిలో గెలుపొంది ఆకారం పేరు ను ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారుడు కిరణ్ మాట్లాడుతూ తమను క్రీడల్లో రానించాలని ప్రోత్సాహిస్తున్న సర్పంచ్ నాగభూషణం, ఎంపీటీసీ లక్ష్మి నారాగౌడ్, ఉప సర్పంచి మహేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో గెలుపొంది ఆకారం గ్రామస్తులకు కానుకగా ఇస్తామని చెప్పారు.
...
https://www.youtube.com/watch?v=S5dcXLSVGSM