చేగుంట గ్రామపంచాయతీ ప్లాస్టిక్ రహిత గ్రామంలో తీర్చిదిద్దడానికి సిబ్బందితోపాటు కార్మికులు అంకితభావంతో పనిచేసి గ్రామాన్ని ఆదర్శంగా ఉండే విధంగా చూడాలని మెదక్ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అన్నారు. చేగుంట గ్రామపంచాయతీ సందర్శించి పలు రికార్డులను పరిశీలించి అనంతరం గ్రామంలోని కూరగాయల మార్కెట్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ డంపింగ్ యార్డ్ ను సందర్శించి పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామంలోని ప్రతినిధులు లలో పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని తడి పొడి చెత్త వేరు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి రెవెన్యూ సోర్స్ వచ్చే అవకాశాలు చూసి వాటికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతిరోజు వీధులలో శుభ్రం చేయడమే కాకుండా దానిపై ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆరుబయట చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు అన్నారు ఎలాంటి అలసత్వం వహించిన సిబ్బంది పైన కానీ అధికారుల పైన చర్యలు తప్పవన్నారు. చేగుంట లోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సందర్శించి పారిశుద్ధ పనులను పర్యవేక్షించారు. అనంతరం సర్పంచ్ మంచి కట్ల శ్రీన
...
https://www.youtube.com/watch?v=RccaCEjtDXU