#teacher #students #school
సర్కార్ బడులలో చదవాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమ పిల్లలను చదివించడానికి సుముఖత చూపని ఈ రోజుల్లో, బడిపంతులు చూపిస్తున్న అంకితభావానికి ఆ గ్రామస్తులే ఫిదా అయిపోయి ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి నై అంటూ, సర్కార్ బడిలోకి పంపించడానికి సై అంటున్నారు.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ బడి పంతులు పేరు కృష్ణమూర్తి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మీరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. అందరిలాగే ఈ ఉపాధ్యాయుడు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పాఠశాలకు ఐదు నిమిషాల ముందు రావడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతుంటారు. కానీ ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు వచ్చి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ బడిపంతులు కృష్ణమూర్తి. ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నాడేమో అందుకే ముందస్తునారు అనుకుంటే పొరపాటే, విద్యార్థులను తల పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి వస్తుండడం ఆదర్శనీయం.. విద్యార్థులకు తనదైన శైలిలో సుమారు ఇప్పటివరకు వందకు పైగా పద్యాలను బోధించి శభాష్ అనిపించుకున్నాడు. పాఠశాలలోని ఏ విద్యార్థిని అడిగిన 40 నుండి 50 కి పైగా పద్యాలను అనర్గళంగా చెప్పడం విశేషం.. ఇలా అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉంటే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇలాంటి సర్కారు బడిలోకి పంపడానికి పంపించడానికి సుముఖత చూపుతారు అంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా విద్యార్థుల కోసం ప్రతిరోజు ఉదయం 8 గంటలకే బడికి వస్తేనే, తనకు సంతోషంగా ఉంటుందని చెప్పడం కృష్ణమూర్తి స్పెషల్.. ఇలాంటి ఉపాధ్యాయులు ప్రతి చోట ఉండాలని కోరుకుందాం...
...
https://www.youtube.com/watch?v=cfNjNoMEMmY
#dubbak #congress #cheruku
జాతరలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో నిర్వహించిన దుర్గమ్మ జాతరలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండి ఊరేగింపు కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాల్గొని గ్రామంలోని గ్రామ పెద్దలతో ముచ్చటించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొల్లపల్లి కనకయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=YVbpZqr0DTs
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఇటీవలే మృతిచెందిన నిరుపేద కుటుంబాలకు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు భర్త దూరమైన కుటుంబం.. మరొకరు ఏళ్ల కొద్ది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు.. ఇలా వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు దుబ్బాక ఎన్నారై శ్రీరామ్ ప్రతాప్ చేయూతను అందించారు.. శ్రీరామ్ ప్రతాప్ సేవ సమితి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలో నాలుగు బాధిత కుటుంబాలను పరామర్శించి రెండు క్వింటాల్ బియ్యం అందించారు. తాను పుట్టిన దుబ్బాక ప్రాంతానికి సేవ చేయడం గొప్ప అదృష్టం గా భావిస్తున్నామన్నారు.. ప్రతి ఒక్కరూ సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఖర్చు చేయాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో సేవ సమితి ప్రతినిధులు బాల్ రెడ్డి, . సాగర్ .చందు, భాను.తదితులున్నారు..
...
https://www.youtube.com/watch?v=6ZvXgICwhcY