ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ నిరవధిక సమ్మె 30వ రోజులో భాగంగా కార్మికులు వినూత రీతిలో కార్మికులు ర్యాలీ నిర్వహించి బస్సు డిపో ముందు కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తమ సమస్యలు తీర్చేంత వరకు డ్యూటీలో చేరమంటూ కార్మికులు ముందుగా ప్రతిజ్ఞ చేశారు తర్వాత కార్మికులంతా ఒంటికాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ఇరవై మూడు మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగాలు చేసిన సిఎం కెసిఆర్ మనస్సు కరగడం లేదన్నారు మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల డిమాండ్ నెరవేర్చాలని వారు కోరారు ... https://www.youtube.com/watch?v=nyVSDWYaIc4
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని జూలై మాసంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్లు పూర్తి చేసి ఇస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు..
చేగుంట మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు ,గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు , ఈనెల 11వ తేదీన మండల తాసిల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్ , ఎంపిటిసి శంభుని రవి, నాయకులు గోవింద్, ఎల్లారెడ్డి. రాజగోపాల్ ,పాండు, స్వామి హరి శంకర్ , శేఖర్ గౌడ్ బిక్షపతి , సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=K_mIibZcNy0
సిద్దిపేట జిల్లా దుబ్బాక లో స్థానిక చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద దుబ్బాక నియోజకవర్గం లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి 48 గంటల నిరాహార దీక్ష పూనుకున్నారు దీక్షకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి హాజరై దీక్షను ప్రారంభించారు ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసింది కానీ నిరుపేదలకు ఇవ్వలేదన్నారు పూర్తి అయిన ఇండ్లలో కొందరు అర్హులు గృహప్రవేశాలు చేస్తే వారిని పోలీసుల చేత ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసమని అధికార పార్టీని వారు ప్రశ్నించారు పూర్తయిన ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు పూర్తయిన ఇండ్లను ఇవ్వకపోతే పాడైపోయే అవకాశాలు ఉన్నాయన్నారు
అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తరఫున 48 గంటలు దీక్షకు చేపడుతున్నామన్నారు ఈ దీక్ష ప్రజల కోసమే అని వారు అన్నారు ఈ దీక్ష కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=xAF6gKGxNio