#s2news #kudavelly #vaagu
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కూడవెల్లి వాగు ఉగ్రరూపం దాల్చింది . సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, ఆల్వాల, లింగుపల్లి, మల్లుపల్లి, మోతే, రుద్రారం, భూంపల్లి గ్రామాల్లోని చెక్ డ్యామ్ వద్ద వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. చెక్ డ్యాములో ఉధృతంగా వరద నీరు ప్రవహించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు వాగు నీరు ద్వారా ఎంతగానో మేలు చేకూరుతుందని అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు నిండుకుండల మారడంతో భూగర్భ జలాలు పెరగడంతోపాటు వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సాగునీటి కష్టాలు తీర్చడానికి కూడవెళ్లి వాగు దోహదపడుతుందన్నారు. కూడవెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు వాగు ప్రవాహాన్ని తిలకించడంతోపాటు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెళ్లి వాగును చూడడానికి వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
...
https://www.youtube.com/watch?v=H7MsLfRTCOg