Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=XrmjveemXTI
#mpkpr #kpr #brs
దేశ రాజకీయాల్లో సీఎం కెసిఆర్ తోనే మార్పు సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసే కెసిఆర్ స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో భారత్ రాష్ట్ర సమితి జెండాను ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే రోజులు దేశంలో తిరుగులేని శక్తిగా బిఆర్ఎస్ పార్టీ అవతరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కులమత విద్వేషాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించే కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పొందుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. అనంతరం తొగుట మండలం లింగంపేట నుండి అల్వాల వెళ్లే కూడవెల్లి బ్రిడ్జి నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాతలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. దాతల సహకారంతో రెండు శవాలను భద్రపరిచే ఫ్రీజర్లను తొగుట మండల ప్రజలకు ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు, పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=-ez67WU5ClM
#s2news #trs #kpr
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఆలోచనతో రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా సాగుతున్న విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యాసంగి లో వరి ధాన్యాన్ని కొనమని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి వరి ధాన్యాన్ని గతంలో మాదిరిగానే గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులు రైతులకు సహకరించాలని సూచించారు. అకాల వర్షాలు పడక ముం��
...
https://www.youtube.com/watch?v=1McTczr2sy4
#congress #sdptcongress #revanthreddy
రాహుల్ గాంధీ పై రాజకీయ కక్ష కట్టిన మోదీ..
*రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయటం ప్రజాస్వామ్యనికి సిగ్గు చేటు. *రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ* *BJP ప్రభుత్వం పై ఘాటు విమర్శలు* *సిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మను దహనం.. ధర్నా* కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ గారి లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడం పై నేడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో ముస్తాబద్ చవరస్థ లో మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి అనంతరం ధర్నా చేయడం జరిగింది.ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ.కేవలం మోడీ.ఆధాని యొక్క చీకటి కుంభకోణలను రాహుల్ గాంధీ గారు లోక్ సభలో ప్రశ్నించటం వల్ల రహుల్ గాంధీ పై రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం సిగ్గు చేటు అని ఈ విషయం ని దేశప్రజాలు గమనిస్తున్నారు అని అన్నారు.ప్రజా స్వామ్యనికి చీకటి రోజు అని.దేశంలో నిర్బంధము.నియంత పాలన నడుస్తుంది అని.కన్యాకుమారి నుండి కాస్మిర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర చేశారు అని.దానితో ఆయనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది అని.అది చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు.దేశ ప్రజా స్వామ్యం కోసం గాంధి కుటుంభం రక్తాన్ని ధరబోసింది అని.అలాంటి ప్రజా స్వామ్యని నేడు మోడీ ప్రభుత్వం అణిచివేస్తుంది అని అన్నారు.ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారుపార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు.మోడీ పాలన ఎమర్జెన్సీ ని మించిపోతుంది అని.ప్రజా స్వామ్యనికి.రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది అని అన్నారు. దేశ ప్రజల హక్కుల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ఆపటం ఎవరి తనము కాదని అన్నారు.కోర్టు తీర్పు వచ్చాక ..బెహిల్ ఇచ్చి 30 రోజుల సమయం కానీ 24 గంటలు గడవకముందే అనర్వాత వేటు ప్రకటిచటం దుర్మార్గము.వెంటనే ఈ నిర్ణయం వేనక్కీ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తునం అన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఏతున్న ఆందోళనలు చేస్తామని BJP నాయకులను రోడ్ల మీద తిరగనివామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర.మైనార్టీ రాష్ట్ర కోర్దినేటర్ కలిమోద్దీన్.రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూజల గోపి కృష్ణ. జిల్లా నాయకులు అంజిరెడ్డి.ఫుల్లురు గ్రామ అధ్యక్షుడు కనకయ్య.నరాయనరవోపేట్ గ్రామ అధ్యక్షుడు బింగి యాదగిరి.సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్.అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వహబ్.యన్ యస్ యూ ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్.అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమర్.చిన్నకోడూర్ మండల అధ్యక్షుడు మీసం మహేందర్.యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి ప్రతాప్.మహిపాల్ రెడ్డి.ఉమ రెడ్డి.చిక్కుడు అంజన
...
https://www.youtube.com/watch?v=U-iS2Jz5POI