#bjp #trs #raghunandanrao
టిఆర్ఎస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా బిజెపి నాయకులు నినాదాలు చేయడంతో టిఆర్ఎస్, బిజెపి నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండలం అక్బర్ పేట చౌరస్తా వద్ద ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బిజెపి నాయకులు అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకుల వద్దకు వాగ్వాదానికి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు టిఆర్ఎస్, బిజెపి నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసుల సాక్షిగా టిఆర్ఎస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు చెప్పులను విసురుకున్నారు. వెంటనే పోలీసులు టిఆర్ఎస్, బిజెపి నాయకులను వేరువేరు వాహనాలు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరు కూడా దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు ధర్నాలు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
...
https://www.youtube.com/watch?v=eL8KohLPM1M