#s2news #aomallesham #agriculture
పంటలకు కావలసిన పోషకాల్లో భాస్వరం ఎంతగానో ముఖ్యమైందని వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో జీవన ఎరువు పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మల్లేశం మాట్లాడుతూ, వేర్ల పెంపకం, మొక్క ఎదుగుదలకు భాస్వరం దోహదపడుతుందన్నారు. బాస్వరం భూమిలో వేసినప్పుడు త్వరగా పంటకు లభ్యం కానీ రూపంలోకి మారిపోతుందన్నారు. రైతులు ఎక్కువ మోతాదులో బాస్వరం ఎరువులు వినియోగించడంతో, మన సాగు భూముల్లో గణనీయంగా భాస్వరం పెరిగిపోయిందన్నారు. భూమిలో లభ్యం కానీ బాస్వరం రూపాన్ని కరిగించి ఉపయోగపడే రీతిలో మార్చడానికి కొన్ని సూక్ష్మజీవులు దోహదపడతాయన్నారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటలలో బాస్వరం ను కరిగించే జీవన ఎరువులు వాడుకోవచ్చని తెలిపారు. ఎకరాకి రెండు కిలోల జీవన ఎరువు లేదా 200 మిల్లీ లీటర్ల ద్రవ జీవన ఎరువులు సుమారు 100 నుండి 200 కిలోల పశువుల పేడలో కలిపి పంట పొలాల్లో చల్లాలని సూచించారు. జీవన ఎరువు వాడకంతో రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=1D8C1vbksq0
#s2news #shivalord #padayatra
లోకకల్యాణార్థం శివ భక్తులు మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. మహా పాదయాత్ర సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చేరుకోవడంతో పాదయాత్ర చేస్తున్న శివ భక్తులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 9 న ప్రారంభమైన మహా పాదయాత్ర కొలనుపాకలో 15న ముగుస్తుందని తెలిపారు. చివరి రోజున ధర్మ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాన్ని కాపాడేందుకు మహాపాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. 16 వ తేదీన జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, వెంకట్ గౌడ్, ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=VVHU6t2jkEo
#justiceforsidhumoosewala #worldsociety
#kamareddy
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
కామారెడ్డి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కామారెడ్డి జిల్లా ఛైర్మన్ ఆకుల స్వామి పేర్కొన్నారు. జాతీయ ఛైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బుధవారం గాంధారి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆకుల స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విద్యార్థుల ఆరోగ్య పరిస్తితులను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. విద్యార్థులకు ఉచిత వైద్య, వైద్యం అందించడం మన ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలకు, విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా సమస్యలు పరిష్కరించదానికి తామ వంతు కృషి చేస్తామన్నారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. తమ సంస్థ జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బాలకార్మిక నిర్మూలన కోసం తాము నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. భోజనాలు సరిగ్గా లేనట్టు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతమన్నారు. పిల్లల హక్కులు కాలరాస్తే జాతీయ మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అర్బన్ ఛైర్మన్ టి. సంజీవులు, గాంధారి మండల ఛైర్మన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=MY6kG4yNphM