దేశ రాజకీయాల్లో సీఎం కెసిఆర్ తోనే మార్పు సాధ్యమవుతుంది- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
#mpkpr #kpr #brs దేశ రాజకీయాల్లో సీఎం కెసిఆర్ తోనే మార్పు సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసే కెసిఆర్ స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో భారత్ రాష్ట్ర సమితి జెండాను ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే రోజులు దేశంలో తిరుగులేని శక్తిగా బిఆర్ఎస్ పార్టీ అవతరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కులమత విద్వేషాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించే కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పొందుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. అనంతరం తొగుట మండలం లింగంపేట నుండి అల్వాల వెళ్లే కూడవెల్లి బ్రిడ్జి నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాతలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. దాతల సహకారంతో రెండు శవాలను భద్రపరిచే ఫ్రీజర్లను తొగుట మండల ప్రజలకు ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు, పలువురు పాల్గొన్నారు. ... https://www.youtube.com/watch?v=-ez67WU5ClM
#s2news #kalvanaresh #mro
ఒటా బంది గ్రామ సేవకులం మా న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు.. దుబ్బాక పట్టణంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించి.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది... (1)మస్కూరి.. నీరటి అసలుదారుల జీవోను రద్దు చేయాలి..(2) పాత పద్ధతిలోనే. ఎవరైతే విధుల్లో పనిచేస్తున్న ఓట బంధి.గ్రామ సేవకులకు. రెవెన్యూ కార్యాలయంలో నగదు రూపకంగా గాని చెక్కు రూపకంగా గాని తాసిల్దార్ గారు జీతాలు ఇవ్వాలి..(3) విధుల్లో మరణించిన ఓటాబంద్ గ్రామ సేవకుని.. కుటుంబం అన్ని విధాలుగా ఆదుకోవాలి... ఇట్టి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం... ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాల్వ నరేష్.. ఉపాధ్యక్షులు. అస రవి. భాస్కర్.. రెడ్డి మల్ల రాజు... కాల్వ నర్సింగారం... దుబ్బాక మండల ఓట బంది గ్రామ సేవకులు పాల్గొన్నారు..
...
https://www.youtube.com/watch?v=b1x0Zb-4J4M
#mla #bjp #vivekananda
స్వామి వివేకానంద ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆయన 160వ జయంతి సందర్భంగా గురువారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు యువత ఈ దేశ భవిష్యత్తును మారుస్తారని స్వామి వివేకానందుడు కళలు కంటే నేడు నరేంద్ర మోడీ ఆ కళలను నెరవేర్చుతున్నాడని కొనియాడారు. ప్రపంచ దేశాలన్నింటికి దీటుగా భారత దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్లనే అని చెప్పక తప్పదన్నారు. ఏ లక్ష్యం కోసం పరితపిస్తామో ఆ లక్ష్యం నెరవేర్చే వరకు మొక్కవోని ధైర్యం తో ముందుకు సాగాలని యువత కు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లారెడ్డి, నాయకులు బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=6UNVbz15UV4