గోవద నిర్వహిస్తున్న దోషులను 48గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని-ఎమ్మెల్యే రఘునందన్ రావు
ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో గోవులను పెద్ద ఎత్తున గోవద చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏండ్ల తరబడి గోవద చేస్తుంటే ఎవరి కనుసైరల మేరకు ఈ సంఘటన నడుస్తుందో సిద్దిపేట సిపి, పోలీసులు చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దిపేట పట్టణంలో ముఖ్యమంత్రి స్వంత జిల్లా, మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో నిన్న గోవద సంఘటన జరగడం దారుణమన్నారు. ఎవరి కనుసైరల మేరకు ఈ సంఘటన నడిపిస్తున్నారని పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నించారు. ఎంతసేపు ప్రభుత్వం కోసం పనిచేయడమే పోలీసుల పని అయితే అన్యాయాలను అక్రమాలను ఎలా అరికడుతారని ప్రశ్నించారు. సిద్దిపేట గడ్డమీద గోవద అడ్డాగా నిర్వహిస్తున్న దోషులను 48గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాకంటే పెద్ద పూజలు చేసే హిందువులు ఎవరు లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదో వంతుకు ఒకరిద్దరిని అరెస్టు � ... https://www.youtube.com/watch?v=W5szPUpQ1CU