#s2news #harishrao #raghunandanrao
నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైద్య అధికార సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీహెచ్ సీ కేంద్రంలో డ్యూటీ డాక్టర్ ఎవరు.? ఏలాంటి స్పెషలైజేషన్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ అందరూ ఉన్నారా..? ఎవరెవరూ ఉన్నారని ఒక్కొక్కరుగా ఆరా తీశారు. కేంద్రంలో అన్నీ రకాల మందులు ఉన్నాయా అని అడిగి, మందులు లేవనే మాట రావొద్దని ఫార్మసిస్టుకు సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫార్మాసిస్టు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. పీహెచ్ సీ పరిధిలోని నిధుల నిల్వ అంశంపై ఆరా తీసి, తిమ్మాపూర్ పీహెచ్ సీ కూడా కరెక్టు లేదని వెంటనే డీఏంహెచ్ఓతో మాట్లాడి హెచ్డీఎస్ నిధులు తెప్పించుకోవాలని పీహెచ్ సీ వైద్య వర్గాలను ఆదేశించారు.
ఏఎన్సీ పర్సంటేజీ ఎంత ఉంది.?, టీబీ శాంపిల్స్ తీసుకుంటున్నారా..? టీబీ రోగులకు డబ్బులు పడుతున్నాయా..లేదో వివరాలు అడిగి తెలుసుకుంటూనే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ ఆరా తీసి, హెచ్డీఎస్ డబ్బులు వాడుకునేలా ఆమోదం ఇవ్వ��
...
https://www.youtube.com/watch?v=tS7IQLBDuZE
#mla #bjp #raghunandanrao
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి మరియు బల్వతాపూర్ గ్రామాలలో మీషన్ భగీరథ కలుషిత నీరు తాగి దాదాపు ముప్పై మంది అస్వస్థత గురైన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కొరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక మండలం దుంపలపల్లి మరియు బల్వతాపూర్ గ్రామాల్లో ప్రజలు వాంతులు,విరేచనాలతో బాధపడుతున్నా జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. నీటి నాణ్యతను పరిశీలించి ఈ సమస్య ఎందుకు తలెత్తిందో తెలుసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు.అస్వస్థతకు గురై దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=_mRr3FGTh-g
#satyamsreerangam #congress #revanth
" మహిళల్ని గౌరవించే చోట అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయి - డా. సత్యం శ్రీరంగం."
" మహిళలు విజయం సాధించాలంటే దాని కోసం మహిళలు చేసిన కృషి, ప్రతిభ గుర్తించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది - డా. సత్యం శ్రీరంగం."
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ లోని దేవి గ్రాండ్ హోటల్ లో ప్రపంచ మహిళ దినోత్సవం సందర్బంగా శ్రీరంగం ఫౌండషన్ చైర్మన్ పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం కో చైర్మన్ ఆయన సతీమణి ఇందుమతి శ్రీరంగం ఆధ్వర్యంలో మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ మహిళ దినోత్సవాన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం. సునీత రావు గారు హాజరయ్యారు. అదేవిధంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను గుర్తించిన వారిలో సంకల్ప్ ఫౌండేషన్ చైర్మన్ గుండ్ర రోజీ గారిని, డాన్ బాస్కో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మద్ది కనకం రెడ్డి గారిని, అడ్వకేట్ మంజుల గారిని, ఎంట్రప్రెన్యూర్ గీత గారిని, న్యూట్రిషనిస్ట్ ఆశా దేవినేని, విశ్వ ధరణి ఫౌండేషన్ సభ్యురాలు భార్గవి ని ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళ పురస్కారాలను మరియు నీరుపేద మహిళ పద్మకు కుట్టు మిషన్ ను సునీత రావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ మహిళలు గౌరవించే చోటే అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయని అన్నారు. ప్రతి పురుషుడు తమ కుటుంబంలోని ఆడవాళ్లకు ప్రాముఖ్యత, వారి మాటకు విలువ ఇచ్చినపుడు ఆ సమాజంలో వారికి దక్కాల్సిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఒక మహిళా విజయం సాధిచాలంటే దాని కోసం ఆమె చేసిన కృషిని, ప్రతిభను గుర్తించాలన్నారు. అంతే కానీ వారి ఎదుగుదలను ఓర్వలేక వ్యక్తి గతమైన దుష్ప్రచారాలు చేసి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలు దూసుకుపోతున్న అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు ముందుకు వెళుతున్నా కూడా ఎక్కడో ఒక చోట మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారని అన్నారు. భూమికి ఉన్నంత ఓర్పు సహనం మహిళలకు ఉంటుంది మహిళలే సృష్టికి మూలం అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గారాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, విజయ లక్ష్మి, రమాదేవి, జోజోమ్మ, రజిత, జ్యోతి, శోభ, సంధ్య, వరలక్ష్మి, అరుణ యాదవ్, రేణుక మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=wK0Fln85veU