కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ఎలాంటి అపోహలు లేకుండా 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా మండల స్థాయి అధికారులు కృషి చేయాలని డి ఆర్ డి ఎ పిడి గోపాల్ రావు అన్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అపోహలను తొలగించాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఐకెపి సిబ్బంది, ఆశ వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషిచేసి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. మొదటి వ్యాక్సిన్ తీసుకున్నవారికి సెకండ్ డోస్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. వాక్సినేషన్ లో ఇబ్బందులు తలెత్తే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని తెలిపారు. అలాంటి పరిస్థితులు మళ్లీ మనదేశంలో రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు 100% వ్యాక్సినేషన్ తీసుకోవాలనే ఉద్దే�
...
https://www.youtube.com/watch?v=X8xs-CR3SPg
#cherukusrinivas #congress #dubbakcongress
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి రెండు భవనాలను మన తోగుట లో తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి దే అన్నారు.విద్యార్థులకు ప్రోత్సాహం అందించడానికె పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఉమ్మడి జిల్లాలో ఆరు సార్లు 1st రావడం జరిగిందన్నారు కళాశాల ప్రిన్సిపాల్ గన్న బాలకిషన్. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు పట్టణాలకు వలస పోవద్దు అని అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నా పట్టణాలలో లాగా కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో కష్టపడి విద్యార్థులను చదివిస్తున్నారు పరీక్ష ఫెయిల్ అయినందున ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులు అంతటితో ఆగకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాల ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=KqE6-pkYDko
#dubbakpolice #si #ci
దుబ్బాక పట్టణంలో ఫిబ్రవరి నెల 27వ తేదీన 19వ వార్డ్ లో ఎంగారి రాజిరెడ్డి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నిందితున్ని పోలీసులు పట్టుకొని బుధవారం నాడు రిమాండ్ కు తరలించారు. సీఐ కృష్ణ , ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జంగోని సాయికుమార్(24) s/o ప్రభాకర్ దొంగతనాలు చేస్తూ జీవితం గడిపేవాడు. గతంలో దొంగతనం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఫిబ్రవరి 15వ తేదీన విడుదలయ్యాడు. ఈనెల 25వ తేదీన 19 వార్డులోని ఏంగారి రాజిరెడ్డి బంధువుల ఊరు వెళ్లడంతో ఇంటికి తాళాలు ఉండడంతో నిందితుడు తాళాలను పగలగొట్టి బంగారం వెండి వస్తువులను అపహరించాడు. దీంతో ఏంగారి రాజిరెడ్డి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుని కోసం గాలించారు. నిందితున్ని సిద్దిపేట పట్టణంలో పట్టుకొని అరెస్టు చేశారు. గతంలో సాయికుమార్ ఆరు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితుని నుండి పోలీసులు ఐదు తులాల బంగారం సుమారు రెండు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుని పట్టుకున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ రాంజీని ఎస్ఐ మహేందర్ ను సీఐ కృష్ణ అభినందించారు.
...
https://www.youtube.com/watch?v=C0Ym5bYhCoQ
#schoolteachersepyaar #badteacher #teachers
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
రాజశేఖర్ అనే ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపిస్తూ పాఠశాల ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
...
https://www.youtube.com/watch?v=GpHSA9WpZzk