సిద్దిపేట జిల్లాలో కరోనా ఆసుపత్రిలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధను కరోనా వైద్యసేవల పట్ల ఉపయోగిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
వాయిస్ ఓవర్:
సిద్దిపేట లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కరోనా వైద్య సేవల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, తప్పును తప్పు అంటే ,ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెడతాం అనే ధోరణిని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కు హితవు పలికారు.
సిద్దిపేట కరోన ఆసుపత్రిలో అవకతవకలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో, ఇతర ఛానల్ లో వచ్చిన వార్తలకు స్పందించి జిల్లా బీజేపీ మహిళ నేతలు ఆసుపత్రి సిబ్బంది అనుమతి తీసుకొని లోపలికి వెళ్తే సిబ్బంది మీద దాడి చేశారని కేస్ పెట్టడం జిల్లా పోలీసులు తగదని హెచ్చరించారు.
పోలీసులు విచారణ చేసి, సీసీ కెమెరాలను చూసి కేస్ పెట్టాలి ,తప్పుడు పిర్యాదు చేసిన వాళ్లపై కేస్ పట్టాలి కానీ బాధితులకు మనోదర్యం నింపడనికి వెళ��
...
https://www.youtube.com/watch?v=bPT6e9qz7pU
#brs #bjpnews #mirdoddi
మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామ సర్పంచ్ లక్ష్మి యాదగిరి,దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామ సర్పంచ్ బండి రాజు ,ఉప సర్పంచ్ స్వప్న శేఖర్ బీజేపీ పార్టీ కి రాజీనామా
నేడు రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరియు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన చెప్యాల సర్పంచ్ లక్ష్మీ యాదగిరి మరియు దౌల్తాబాద్ మండలం ముత్యం పేట సర్పంచ్ బండి రాజు ఉపసర్పంచ్ స్వప్న శేఖర్ గారు
...
https://www.youtube.com/watch?v=Jo1Z1oInlGE
#s2news #cheruku #congress
చేగుంట మండల్ అధికారుల నిర్లక్ష్యంతో పొద్దున్న 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు రాక రైతులు ఆందోళన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చేగుంట లో గోదాం కి వెళ్లి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. రైతుల కష్టాలు చూసి చేగుంట మండల MRO ఆఫీస్ కి వెళ్లి ఎమ్మార్వో గారితో మాట్లాడి తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తారీకు వరకు వడ్లు కొనుగోలు చేయకపోతే రైతులతో రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు
...
https://www.youtube.com/watch?v=oc6pfAyjCaM
#bjp #raghunandanrao #mla
*పోతారం గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాల్లో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు*
ఈరోజు దుబ్బాక మండలం పోతారం గ్రామంలో జరుగుతున్న మల్లన్న జాతర ఉత్సవాల్లో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పోతారం గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ అనే భూతానికి కారణంగా మారుతున్న ప్లాస్టిక్ ని నివారించాలని ప్లాస్టిక్ వాడకం మానేయాలని గ్రామ ప్రజలను కోరారు.
...
https://www.youtube.com/watch?v=Wiad3FLnjIw
మిరుదొడ్డి : పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పని చేయడం జరుగుతుందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవునేని రఘునందన్ రావు స్పష్టం చేశారు. జెండాలు , అజెండాలు పక్కనబెట్టి గ్రామ అభివృద్ధిలో యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగపల్లి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడే పార్టీల కోసం పని చేయాలని అనంతపురం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు . నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందని సర్పంచ్ యాదగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో తారు రోడ్డు నిర్మాణం, బైపాస్ రోడ్డు వివిధ సంఘాల కమ్యూనిటీ భవనాలకు నిధులను మంజూరు చేయడం జరుగుతుందని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెల
...
https://www.youtube.com/watch?v=YLEq6VFBxSU