మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన బాల గాయని షర్వానికి ఎన్నారైలు (NRI.) అందించిన ఆర్థిక సహాయాన్ని దుబ్బాక బిజెపి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి గోవింద్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ గ్రామానికి చెందిన వేణుగోపాల ఆలయ పూజారి లక్ష్మణ చారి నిరుపేద కుటుంబం , కూతురు మంచి గాయనిగా ఎదగాలని ఎన్నారైలు సంతోష్ ,శశికిరణ్, నాగ కృష్ణ. బ్రాహ్మణ సంఘం అసోసియేషన్ వారు అందించిన లక్ష రూపాయల చెక్కును. ఒక సెల్ఫోన్ను సర్వానికి అందజేశారు. మంచి గాయనిగా ఎదగాలంటే వారి ఆర్థిక స్తోమత సరిగా లేనందున వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో వారు అందించిన ఆర్థిక సాయం సర్వానికి అందజేశారు.
శర్వాణి మాట్లాడుతూ మా కుటుంబ పరిస్థితి గమనించి నాకు ఆర్థిక సహాయం అందించి నా ఎదుగుదలకు ప్రోత్సహించిన ఎన్ఆర్ఐ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈటీవీలో పాడుతా తీయగా. జీ తెలుగులో లిటిల్ స్టార్ సరిగమలు లో పాల్గొన్నానని వారు చేసిన సహాయాన్ని వినియోగించుకొని మంచి గాలిగా మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెస్తాం అన్నది.
ఈ కార్యక్రమంలో మహంకాళి సత్యపాల్ రెడ్డి. బాల్ రెడ్డి. లక్ష్మణ్. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=n-fZ0vih1Ac
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ వార్డులో నిన్న రాత్రి బుధవారం రోజున కురిసిన ఉరుములు మెరుపులుతో కూడిన గాలి వర్షానికి పిడుగుపాటు పడడంతో రైతు సత్తు మహేందర్ రెడ్డి యొక్క పాడి గేదె ఎల్లపూర్ శివార్లలో ఉన్న పొలం వద్ద మృతి చెందింది.ఈ సందర్భంగా బాధిత రైతు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రిందటే అప్పుచేసి పొట్ట కూటి కోసం కొత్తగా పాడిగేదే 80 వేల రూపాయలతో కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్ననాని ఇప్పుడు గేదే మృతి చెందడంతో జీవనం గడవడం అప్పు ను ఎలా తీర్చలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నానని రోదిస్తూ తెలిపారు.ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రకంగానైన ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం.
...
https://www.youtube.com/watch?v=8jXjPNn26TQ