ఆరు నెలల్లో దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో TRSMA ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. రానున్న మూడు సంవత్సరాల లో దుబ్బాక నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండే లాగా తీర్చిదిద్దుతాం అన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఏ గ్రామానికి వెళ్లినా గౌరవించే విధంగా కృషి చేస్తానని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కొందరు రఘునందన్ రావు గెలిచి ఎం చేస్తారని ఎద్దేవా చేశారని రఘునందన్ రావు గెలిస్తే ఎం చేస్తాడో అని విమర్శించారు. వారి మాటలను సవాల్ గా స్వీకరించి రానున్న మూడు సంవత్సరాలలో దుబ్బాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి గా నిలిపి దుబ్బాక ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు. తను ఆస్తులు, అంతస్తులు సంపాదించడానికి రాజకీయాలకు �
...
https://www.youtube.com/watch?v=HpRFbtgHGWU
ఎ ఐ సీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి 73 వ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారెడ్డి పేట గ్రామంలో దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు ఏలూరి కమలాకర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అరవై ఏండ్ల పోరాట ఆకాంక్ష ను నెరవేర్చిన సోనియమ్మ ప్రజా జీవితంలో నూరేండ్లు సుఖ సంతోషాలు తో ఉండాలని సూచించారు. తెలంగాణ తెచ్చిన ఘనత సోనియా గాంధీకి మాత్రమే దక్కుతున్నదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు మరో ఉద్యమం తప్పేట్టు లేదని కాబట్టి ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు విభాగం అందే రాజిరెడ్డి, బీసీ సెల్ విభాగం మండల అధ్యక్షుడు బండి మురళి గౌడ్,నవీన్, సిద్దిరాములు పాతురి కిష్టారెడ్డి, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=f7bL2BqUll8